శ్రీవారి సన్నిదిలో వెంగమాంబ వర్ధంతి ఉత్సవాలు

శ్రీవారి సన్నిదిలో వెంగమాంబ  వర్ధంతి ఉత్సవాలు

శ్రీ  వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన భక్త కవయిత్రి మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 206వ వర్ధంతి ఉత్సవాలు ఆగస్టు 24, 25వ తేదీల్లో తిరుపతి, తరిగొండలో ఘనంగా జరుగనున్నాయి. తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల నుంచి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 25వ తేదీ సాయంత్రం 6 గంటలకు స్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.

తిరుప‌తిలో...

తిరుపతి అన్నమాచార్య కళామందిరంలో ఆగస్టు 24వ తేదీన ఉదయం 9 గంట‌లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు, ఉద‌యం 10 గంటల‌కు తరిగొండ వెంగమాంబ సాహిత్యంపై సదస్సు నిర్వహించనున్నారు. తరిగొండ శ్రీ లక్ష్మీనృసింహస్వామివారి ఆలయంలో ఆగస్టు 24వ తేదీ సాయంత్రం 5.30 గంట‌ల నుంచి ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆగస్టు 25వ తేదీ ఉదయం 11 గంటలకు ఎం.ఆర్‌.పల్లి సర్కిల్‌ వద్ద ఉన్న తరిగొండ వెంగమాంబ విగ్రహానికి టీటీడీ అధికారులు పుష్పాంజలి ఘటిస్తారు. అన్నమాచార్య కళామందిరంలో ఉదయం 10 గంటల‌కు సంగీత స‌భ‌,  ఉద‌యం 11.30 గంట‌ల‌కు హ‌రిక‌థ, సాయంత్రం 6 గంటలకు స్వామివారికి కల్యాణోత్సవం, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో భక్తి సంగీత కార్యక్రమాలు నిర్వహించ‌నున్నారు.